728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
September 1, 2020

చిలకలూరిపేటలో రేషన్ షాపుపై విజిలెన్స్ దాడులు.. డీలర్ పై 420 కేసు

చిలకలూరిపేట: పట్టణంలోని రేషన్ డిపోలపై ఈరోజు గుంటూరుకు చెందిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. పట్టణంలోని పురుషోత్తపట్నం 34 సర్కిల్కు చెందిన మహిళా గ్రూపు నిర్వాహకురాలు షేక్ జైనాబీ చౌకధరల దుకాణం నిర్వహిస్తున్నారు. ఆ రేషన్ దుకాణంపై విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు రావడంతో రేషన్ డిపోలోని నిల్వలు పురుషోత్తపట్నం మరియు వేరే ప్రాంతంలో  ఉన్నట్లు కనిపెట్టిన విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి సుమారు 37 క్వింటాళ్ల చౌక ధరల బియ్యం వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. రికార్డులో ఉన్న దాని ప్రకారం ఈ వ్యత్యాసం రావడంతో సదరు రేషన్ డీలర్ అయిన మహిళపై 420 కేసును నమోదు చేశారు. ఈ దాడుల్లో విజిలెన్స్ ఎస్సై లక్ష్మారెడ్డి, ఎంపీడీవో భ్రమరాంబ, సివిల్ సప్లైస్ డీటీ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఒక్కసారిగా అధికారులు దాడులు నిర్వహించడంతో పట్టణంలోని అక్రమ వ్యాపారస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో రేషన్ షాపుపై విజిలెన్స్ దాడులు.. డీలర్ పై 420 కేసు Rating: 5 Reviewed By: NEWS UPDATE