728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
September 2, 2020

భారత్‌లో 66వేలు దాటిన కరోనా మరణాలు

న్యూఢిల్లీ:
★ భారత్‌లో గతకొన్నిరోజులుగా నిత్యం 70వేలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి.

★ గడిచిన 24గంటల్లో మరో 78,357 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

★ ఒకేరోజు వ్యవధిలో 78వేల కేసులు బయటపడటం ఇది నాలుగోసారి.

★ దీంతో బుధవారంనాటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 37లక్షల 69వేలకు చేరింది.

★ వీరిలో ఇప్పటికే 29,01,908 మంది కోలుకోగా మరో 8లక్షల క్రియాశీల కేసులు ఉన్నాయి.

★ నిన్న మరో 62,026 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

★ ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 77శాతానికి చేరింది.

★ వరుసగా మూడురోజుల తర్వాత మరణాల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది.

★ నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 1045 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు.

★ దీంతో బుధవారం నాటికి దేశంలో కొవిడ్‌ మృతుల సంఖ్య 66,333 కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

★ ప్రస్తుతం భారత్‌లో కరోనా మరణాల రేటు 1.7శాతంగా ఉంది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: భారత్‌లో 66వేలు దాటిన కరోనా మరణాలు Rating: 5 Reviewed By: NEWS UPDATE