★ శ్రీశైలం ఆనకట్ట సమీపంలో పెద్ద ప్రమాదం తప్పింది.
★ ఆనకట్ట ప్రవేశద్వారం వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి.
★ పైనుంచి పెద్ద బండరాళ్లు జారిపడ్డాయి.
★ రాత్రి వేళ కావడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు.
★ ఉద్యోగులు, పర్యాటకులు రాకపోకలు సాగించేచోట ఈ విధంగా బండరాళ్లు పడటం ఆందోళన కలిగిస్తోంది.
★ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కొండచరియలు విరిగిపడే చోట కంచె ఏర్పాటు చేయాల్సిన అవసరముందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

