ది 11-04-22 చిలకలూరిపేట సబ్ డివిజన్ పరిధిలోని D1,చిలకలూరిపేట సెక్షన్లోని విద్యుత్ శాఖ గుంటూరు డి. పి ఈ డిప్యూటీ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ సురేంద్ర బాబు ఆధ్వర్యంలో అసిస్టెంట్ ఇంజనీర్లు, ఆపరేషన్ సిబ్బంది తో 30 బ్యాచ్ లుగా దాడులు నిర్వహించి 2,879
సర్వీస్ లను తనిఖీ చేయగా అదనపు లోడ్ విద్యుత్ వినియోగం కింద 125 కేసులు నమోదు చేసి రు 3,53,500 అపరాధ రుసుము, విద్యుత్ చౌర్యం కింద 7 కేసు లు నమోదు చేసి రు.73,500/- అపరాధ రుసుం వేసినట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. పై అధికారుల ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా అనధికార విద్యుత్ వినియోగం చేస్తున్నవారి పై మున్ముందు విద్యుత్ సిబ్బంది గ్రూప్ లుగా దాడులు నిర్వహిస్తామని కేసులు నమోదు చేసి భారీగా అపరాధ రుసుం విధిస్తామని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట డిప్యూటీ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ కె. నారాయణ, చిలకలూరిపేట టవున్ 1 అసిస్టెంట్ ఎక్జిక్యూటివ్ ఇంజనీరు పి. భార్గవి మరియు విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.

