చిలకలూరిపేట: అంబేద్కర్ జయంతి రోజు నవతరం పార్టీ కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశంలో రిజర్వేషన్లు ఎత్తివేయాలని కోరుతూ వీటిపై నవతరం పార్టీ పోరాటం చేస్తుందని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ఎత్తివేయాలని కోరుతూ నవతరం పార్టీ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం ప్రకటన చేశారు. కొంత మంది దళిత సంఘం నాయకులు రావు సుబ్రమణ్యం పై శుక్రవారం చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే రావు సుబ్రమణ్యం ఇంటి వద్ద కారు, ఫర్నీచర్ కొంతమంది ధ్వంసం చేయడంతో ఇంటి వద్ద పోలీసులను ఉంచారు. అయితే తాజాగా శనివారం ఉదయం చిలకలూరిపేట ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్నానవతరం పార్టీ కార్యాలయాన్ని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
చిలకలూరిపేటలో నవతరం పార్టీ కార్యాలయం ధ్వంసం
చిలకలూరిపేట: అంబేద్కర్ జయంతి రోజు నవతరం పార్టీ కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశంలో రిజర్వేషన్లు ఎత్తివేయాలని కోరుతూ వీటిపై నవతరం పార్టీ పోరాటం చేస్తుందని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ఎత్తివేయాలని కోరుతూ నవతరం పార్టీ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం ప్రకటన చేశారు. కొంత మంది దళిత సంఘం నాయకులు రావు సుబ్రమణ్యం పై శుక్రవారం చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే రావు సుబ్రమణ్యం ఇంటి వద్ద కారు, ఫర్నీచర్ కొంతమంది ధ్వంసం చేయడంతో ఇంటి వద్ద పోలీసులను ఉంచారు. అయితే తాజాగా శనివారం ఉదయం చిలకలూరిపేట ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్నానవతరం పార్టీ కార్యాలయాన్ని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

