చిలకలూరిపేట: చిలకలూరిపేట కేబీ రోడ్డులో వెంకటేశ్వర థియేటర్ ఎదురు సమీప ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు.
భాష్యం స్కూలు బస్సు పురుషోత్తమపట్నం అడ్డ రోడ్డు వైపు నుంచి తహాసిల్దార్ కార్యాలయం వైపు వెళుతోంది. ఈ క్రమంలో ద్విచక్రవాహనంపై వస్తున్న యువకుడు బస్సు కింద పడి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. అయితే సదరు యువకుడి వద్ద సూసైడ్ లెటర్ ఉండటం ఈ ఘటనపై పలు అనుమానాలకు తావిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ సమయంలో చిలకలూరిపేట 108 సిబ్బంది అటుగా వెళుతూ మానవతా దృక్పథంతో వాహనాన్ని ఆపి పరిశీలించగా అప్పటికే యువకుడు మృతి చెంది ఉండడంతో వారు వెనుదిరిగి వెళ్లారు.

