నరసరావుపేటకు చెందిన కొత్త శ్రీనివాసరావు అతని భార్యతో కలిసి విజయవాడలో బంధువుల ఫంక్షన్ కు హాజరయ్యేందుకు ఈ నెల 14వ తేదీన నరసరావుపేట నుంచి ఆర్టీసీ బస్సులో చిలకలూరిపేటకు వచ్చారు.
చిలకలూరిపేట ఆర్టీసీ బస్ స్టాండ్ లో బస్సు దిగి ఒంగోలు నుంచి వస్తున్న బంధువుల కోసం 20 నుంచి 30 నిముషాలపాటు అక్కడ వేచి చూశారు. బంధువులు వచ్చిన తర్వాత కారులో వారితో కలిసి విజయవాడ వెళ్ళారు.
విజయవాడ వెళ్లి చూసుకోగా వారి బ్యాగ్ లో ఉంచిన 13.5 సవర్ల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించారు.
ఈ విషయంపై పల్నాడు జిల్లా పోలీసు కార్యాలయంలో స్పందనలో ఫిర్యాదు చేశాడు.

