పల్నాడు: జిల్లాలో వెనుకబడిన మండలాలైన బొల్లాపల్లి, మాచవరం, వెల్దుర్తి మండలాల్లోని స్కూల్స్ లో అసిస్ట్ సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వం తరఫున 62 మంది విద్యా వాలంటీర్లను నియమించే కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా కలెక్టర్ శివ శంకర్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవలు మంగళవారం ప్రారంభించారు. ఈ విద్యా వాలంటీర్ల కార్యక్రమాన్ని సింఖని, టిసిఎస్, అసిస్ట్ సంస్థల సహాయంతో సంవత్సరం పాటు కొనసాగనుంది. ఈ 62 మంది వాలంటీర్లకు విజ్ఞాన్ యూనివర్సిటీ వారు శిక్షణను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఇన్చార్జి DEO ఓబుల నాయుడు, బొల్లాపల్లి ఎంఈఓ జఫ్రుల్ల, మాచవరం ఎంఈఓ రాజకుమారి, వెల్దుర్తి ఎంఈఓ సురేష్, నర్సారావుపేట ఆర్డీవో సేశి రెడ్డి, అసిస్ట్ సంస్థ అసోసియేట్ డైరెక్టర్ కృష్ణ హరీష్, విష్ణు ప్రియ, సూర్యనారాయణ, డిప్యూటీ డైరెక్టర్లు రవిబాబు, కోఆర్డినేటర్ శ్రీను, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
July 5, 2022
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: అసిస్ట్ సహకారంతో మూడు మండలాల్లో విద్యా వాలంటీర్లు నియామకం
Rating: 5
Reviewed By: NEWS UPDATE

