విధి నిర్వహణలో చక్కని ప్రతిభ కనబరిచిన అధికారులకు ఇచ్చే ఉత్తమ ప్రశంసా పత్రం చిలకలూరిపేట అర్బన్ సీఐ జి రాజేష్ రావుకు దక్కింది.
75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా పల్నాడు జిల్లా నరసరావుపేటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఇన్చార్జి మంత్రి కార్మూరి నాగేశ్వరరావు, జిల్లా ఎస్పీ చేతుల మీదగా అర్బన్ సీఐ జి రాజేశ్వరావు ఉత్తమ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఇప్పటికే అర్బన్ సిఐ జి రాజేశ్వరారావు నాలుగుసార్లు జిల్లాలో ప్రశంస పత్రాన్ని పలు అందుకున్నారు.
ఈ సందర్భంగా చిలకలూరిపేట అర్బన్ ఎస్సైలు, పోలీస్ స్టేషన్ సిబ్బంది పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

