చిలకలూరిపేట పట్టణంలోని డైక్ మన్ కాలనీలో రావూరి సీతయ్య, లక్ష్మి తిరుపతమ్మ దంపతులు నివసిస్తున్నారు. వీరు కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు.
వీరికి ఇరువురు ఆడ పిల్లలు.
అయితే కుటుంబ కలహాల నేపథ్యంలో సీతయ్య అత్త ఇద్దరు పిల్లలు రేషన్ బియ్యం తీసుకోవడానికి బయటకు వెళ్ళగా వారు ఇంటికి వచ్చేసరికి భార్య ముఖంపై దిండుతో వత్తటముతో ఆమె మృతి చెందింది. భార్యను భర్తే కాలయముడై దిండుతో మొహం మీద వొత్తి చంపినట్లుగా స్థానికులు వివరించారు. అర్బన్ పోలీసులు కేసును నమోదు చేసుకొని విచారిస్తున్నారు.

