ఈనెల 15వ తేదీ కృష్ణాజిల్లా ఏలూరు నుండి శబరిమలైకు బయలుదేరిన బస్సు AP 27TU 5747 ఈరోజు ఉదయం నుంచి తిరిగి వస్తుండగా తమ్ము కు 30 కిలోమీటర్ల దూరంలో లోయలో పడిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో ఏలూరు చెందిన ప్రయాణికులు ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండగా కొంతమందికి గాయాలయ్యాయి.
ఈ బస్సు చిలకలూరిపేట పట్టణానికి చెందినదిగా వార్తలు రావడంతో ఒక్కసారి చుట్టుపక్కల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అయితే దీనికి సంబంధించిన వివరాలు ప్రకారం ....గత రెండు నెలల క్రితం 26.9.2022 తేదీన చిలకలూరిపేట మోడరన్ ట్రావెల్స్కు చెందిన బస్సును మార్టూరు మండలం జొన్న తాళి గ్రామానికి చెందిన చండ్రాజుపల్లి ఆదాం కొనుగోలు చేశాడు. ఈ బస్సుకు డ్రైవర్ గా పర్చూరు కు చెందిన ఆసిఫ్ ను నియమించి ఈనెల 15వ తేదీన బాడుగకు కృష్ణాజిల్లా ఏలూరుకు పంపగా.... ఈ బస్సు బ్రేక్ ఫెయిల్ అయి లోయల పడ్డట్టు తెలుస్తుంది..

