చిలకలూరిపేట నియోజకవర్గం పరిధిలోని మూడు మండలాలతో పాటు చిలకలూరిపేట పట్టణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను నియమించడం జరిగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
చిలకలూరిపేట పట్టణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పఠాన్ తల్హాఖాన్ ను,
చిలకలూరిపేట రూరల్ మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గోవిందాపురం గ్రామానికి చెందిన గుత్తా వేమలయ్యను
నాదెండ్ల మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తూబాడు గ్రామానికి చెందిన మద్దూరి కోటిరెడ్డిని,
యడ్లపాడు మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జాలాది గ్రామానికి చెందిన గంటా శంకర్ లను నియమించినట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. వీరి నియామకాలు తక్షణమే అమలులోకి వస్తాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలియజేశారు.

