చిలకలూరిపేట మండలం పసుమర్రు సమీపంలో ఆటోను అశోక్ లేలాండ్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో వెళుతున్న 8 మంది కూలీలకు గాయాలయ్యాయి. పసుమార్రు గ్రామానికి చెందిన 12 మంది కూలీలు పోలం పనుల నిమిత్తం ఆటో లో వెళుతుండగా ఆటో అశోక్ లేలాండ్ ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురికి స్వల్ప గాయాలు కాగా... వారు చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
April 26, 2023
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: లారీ ఆటో ఢీ... 8 మంది కూలీలకు తీవ్ర గాయాలు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

