728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 14, 2023

చిలకలూరిపేట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు మృతి

చిలకలూరిపేట మండలం కట్టుబడి వారి పాల గ్రామానికి చెందిన మోపూరు రమేష్ బాబు ,మోపురి బాలకృష్ణ ఇద్దరు అన్నదమ్ములు స్కూటీ మీద చిలకలూరిపేట నుండి గుంటూరు రైల్వే స్టేషన్ కి వెళుతుండగా   కృష్ణ గంగ స్పిన్నింగ్ మిల్ హైవేపై చిలకలూరిపేట నుండి గుంటూరు వెళుతున్న ఇచర్ లారీkao7b5784 నెంబర్ గల బండి వెనక నుండి స్కూటీని గట్టిగ ఢీకొనడంతో స్కూటీ స్కూటీ మీద ఉన్న ఇద్దరు వ్యక్తులని లారీ తొక్కించి 50 అడుగులు లారీ ఇద్దరు వ్యక్తులను ఈర్చుకొని వెళ్ళినది ఇద్దరు వ్యక్తులు తల  నిజ్జునుజ్జై అక్కడికక్కడే మృతి చెందారు.

మృతి చెందిన వారిని యడ్లపాడు పోలీస్ సిబ్బంది వారు చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

అక్కడ వారి తల్లిదండ్రులు ,బంధుమిత్రులు కట్టుబడి కట్టుబడి వారి పాలo .గ్రామ ప్రజలు శ్లోకసముద్రంలో ఉన్నారు.

మోపురి రమేష్ బాబుకి (31)వివాహమై ఆరునెల పాప కలదు,

మోపురి బాలకృష్ణకి( 26)ఈ మధ్యనే వివాహ నిశ్చయం ఖరారై ఉన్నది.

వీరి తల్లిదండ్రుల పేర్లు తండ్రి మోపురి చిన్న కృష్ణారావు ,అమ్మ గోవిందమ్మ.

మోపురి రమేష్ బాబు విశాఖలో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ ఉన్నారు.

మోపురి బాలకృష్ణ సాతులూరు రైల్వే గేట్ దగ్గర గేట్ మెయిన్ గా పనిచేస్తూ ఉన్నారు.

ఇద్దరు అకస్మాత్తుగా చనిపోవడం వలన వారి కుటుంబ సభ్యులు దిక్కెవరు అంటూ  విలపిస్తూ ఉన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు మృతి Rating: 5 Reviewed By: NEWS UPDATE