728x90 AdSpace

LOCAL

Advertisement

Advt

Advertisement

FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 31, 2023

ఎడ్లపాడులో బ్యాంకు అప్రైజర్ ఘరానా మోసం.... లక్షలు పై చిలుకు బ్యాంకు ను బురిడీ కొట్టించిన వైనం..... సీసీ కెమెరాల వల్ల బయటపడిన దొంగతనం


యడ్లపాడు : బ్యాంకు కు ఖాతాదారుల కు మధ్య వారధి లాగా ఉండి ఖతదారులు తీసుకువచ్చిన బంగారం నాణ్యత ను పరి శీలించే  అప్రైజర్ ఖాతాదారులు తెచ్చిన బంగారం ఎంచక్కా జేబు లో పెట్టుకుని వుడాయించిన సంఘటన బుధవారం యడ్లపాడు యూనియన్ బ్యాంకు లో చోటు చేసుకోగా గురువారం బ్యాంకు మేనేజర్ పోలీసులను ఆశ్రయించనున్నారు. బ్యాంకు మేనేజర్ తెలిపిన ప్రాథమిక సమాచారం ప్రకారం యడ్లపాడుకు చెందిన నిడమానూరు హరీష్ బ్యాంకు లో గోల్డ్ అప్రైజర్ గా పనిచేస్తున్నారని, ఇ క్రమంలో  బుధవారం బ్యాంకు లో కుదువ పెట్టిన ఖాతాదారుల బంగారం సుమారు 304 గ్రాములు  బంగారం బ్యాంకులో జమ చేయవలసి ఉండగా మధ్యాహ్నం నుండి హరీష్  బ్యాంకు కు రాకపోవడం, అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉండటం తో అనుమానం వచ్చి సీసీ కెమెరాలు పరిశీలించగా భోజన విరామసమయానికి ముందు కుదవ కు వచ్చిన బంగారం అతని జేబులో పెట్టుకోవడం కన్పించిందని  తెలిపారు. హరీష్ ప్రవర్తన పై అనుమానం తో ఉన్నతా ధికారులకు సమాచారమందించి బ్యాంకు లో ఇప్పటివరకు 1886 ఖాతా లలో కుదువ పెట్టిన  బంగారం పరిశీలన కొరకు ఆడిట్ అధికారులను పిలిపించడం జరిగిందన్నారు. వారు బుధవారం, గురువారం  రెండు రోజులు సుమారుగా 500 ఖాతాలను పరిశీలించగా  30 ఖాతాలలో హరీష్ వేరువేరు పేర్లతో బినామీగా నకిలీ బంగారం తాకట్టు పెట్టి 40 లక్షలు డబ్బులు తీసుకునట్లు తేలిందన్నారు. జరిగిన సంఘటన పై పోలీసులకు ప్రాధమిక సమాచారం అందించామని,దీనిపై పూర్తి స్థాయిలో ఆడిట్ నిర్వహించి ఏ మేరకు  బ్యాంకు ను మోసగించారో తెలుసుకుని పోలీసులకు పుర్తి సమాచారం అందజేస్తామని తెలిపారు. ఐతే బ్యాంకు లో బంగారం కుదువ పెట్టిన ఖాతాదారుల బంగారం  బ్యాంకులోనే ఉందని ఖతదారులు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని అయన తెలిపారు. ఈ విషయం పై ఇంకా ఫిర్యాదు అందలేదని ఎడ్లపాడు ఎస్ఐ తెలిపారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఎడ్లపాడులో బ్యాంకు అప్రైజర్ ఘరానా మోసం.... లక్షలు పై చిలుకు బ్యాంకు ను బురిడీ కొట్టించిన వైనం..... సీసీ కెమెరాల వల్ల బయటపడిన దొంగతనం Rating: 5 Reviewed By: NEWS UPDATE