చిలకలూరిపేట: పట్టణానికి చెందిన కట్టా కృష్ణ (19) మృతి చెంది ఐదుగురు జీవితాల్లో వెలుగు నింపాడు. చిలకలూరిపేట పట్టణంలోని శాంతినగర్కు చెందిన కట్ట కృష్ణ(19) శనివారం చిలకలూరిపేట అడ్డరోడ్డు సెంటర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే బ్రెయిన్ డెడ్ కాగా సీఎం జగన్ మోహన్ రెడ్డి సహాయంతో అతని యొక్క అవయవాలను దానం చేసేందుకు తల్లిదండ్రులు ముందుకు వచ్చారు. ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి రాగా వెంటనే స్పందించిన ఆయన
ప్రత్యేక హెలికాఫ్టర్ను వారి కోసం ఏర్పాటు చేయించారు.
అవయవాల తరలింపు కోసం గ్రీన్ ఛానల్...
చిలకలూరిపేటకు చెందిన కృష్ణ(19) యువకుడు రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ కావడంతో అతను చనిపోయినట్లు గుంటూరు పట్టణంలోని రమేష్ ఆసుపత్రి వైద్యులు ధ్రువీకరించారు. దీంతో అతని అవయవాలను దానం చేసేందుకు తల్లిదండ్రులు అంగీకరించారు. ఈ క్రమంలో మృతి చెందిన యువకుడి గుండెను తిరుపతి లోని శ్రీ పద్మావతి చిల్డ్రన్న్స్ హార్ట్ కేర్ హాస్పిటల్కు తరలించారు. దీనికోసం ప్రభుత్వం గ్రీన్ ఛానల్ను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచనల మేరకు హెలికాప్టరు ఏర్పాటు చేయడంతో వెంటనే మృతుని గుండెను తిరుపతికి హుటాహుటిన తీసుకెళ్లారు. ఇక విశాఖపట్ననికి లివర్, గుంటూరు, విజయవాడ ఆసుపత్రులకు కిడ్నీలను తరలించారు. కర్నూలు జిల్లాకు చెందిన వ్యక్తికి హార్ట్ ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్ను తిరుపతి పద్మావతి ఆసుపత్రి వైద్యులు చేస్తున్నారు.
ఐదుగురి జీవితాల్లో వెలుగు నింపిన చిలకలూరిపేట కృష్ణ...
కట్ట కృష్ణ తండ్రి రాజు ఆటో డ్రైవర్, తల్లి మల్లేశ్వరి వీరు చిలకలూరిపేట పట్టణంలోని శాంతినగర్ లో నివసిస్తున్నారు. పెద్ద కుమారుడు కృష్ణ కాక వీరికి ఇద్దరు కుమారులు కలరు. పెద్ద కుమారుడు కృష్ణ గుంటూరు నారాయణ విద్యాసంస్థల్లో ఇంటర్మీడియట్ రెండు సంవత్సరం చదువుతున్నాడు. శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ కృష్ణ మృతి చెందడంతో బ్రెయిన్ డెడ్ అనే డాక్టర్లు చెప్పడంతో తన కుమారుని అవయవాల ద్వారా ఐదుగురికి జీవితాల్లో వెలుగునింపచ్చని తల్లిదండ్రులు అవయదానం చేశారు. కట్టా కృష్ణ మృతదేహం చిలకలూరిపేట లోని శాంతినగర్కు మంగళవారం సాయంత్రం చేరింది. అంత్యక్రియలు బుధవారం ఉదయం శాంతినగర్ లోని తమ స్వగృహం నుండి బయలుదేరుతాయని కట్ట కృష్ణ తల్లిదండ్రులు తెలియజేశారు. చిలకలూరిపేట పట్టణంలోని శాంతినగర్ లో విషాద చాయిలు అలముకున్నాయి.

