చిలకలూరిపేట పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిలకలూరిపేట పట్టణానికి చెందిన ఒక వ్యక్తి గణపవరం గ్రామానికి చెందిన ఇంకో వ్యక్తి బైక్ లపై వస్తుండగా చిలకలూరిపేట కొత్త మార్కెట్ యార్డు ఎదురు కారు ఢీకొని ఈ ప్రమాదంలో ఇరువురు వ్యక్తులు మృతి చెందారు.
చిలకలూరిపేట పట్టణానికి చెందిన సెల్ షాపు యజమాని దామిసెట్టి కిషోర్ (40) గణపవరం కు చెందిన కే .కోటేశ్వరరావు బైక్లపై వస్తుండగా గుంటూరు వైపు నుంచి వస్తున్న కారు బైక్లను ఢీకొనడంతో కొత్త మార్కెట్ యార్డ్ ఎదురు జాతియ రహదారిపై ఇరువురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. కిషోర్ సెల్ షాప్ నిర్వహిస్తుండగా కూరగాయల నిమిత్తం వెళ్లి కూరగాయలు తీసుకొని వస్తున్నాడు. గణపవరం కు చెందిన కోటేశ్వరావు టీవీఎస్ ఎక్సెల్ పై వస్తుండగా ఇరువురి బైకులను గుంటూరు వైపు నుంచి వస్తున్న కారు అదుపు తప్పి బైక్ లను ఢీకొని పట్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఇరువురి వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదం జరగడంతో చౌత్ర సెంటర్లోని కిషోర్ ఇంటి వద్ద విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.