చిలకలూరిపేట ఏపీ సిపిడిసిఎల్ రూరల్ అసిస్టెంట్ ఇంజనీర్ ప్రకాష్ రావు నాయక్ను ఏసీబి అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. చిలకలూరిపేట మండలం కమ్మవారిపాలెం గ్రామానికి చెందిన నిరుపేద రైతు అనిల్ కుమార్ వద్ద నుండి వ్యవసాయ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోగా 55000 మనీ రూరల్ డిమాండ్ చేస్తున్నాడని ఏసీ అధికారులకు సమాచారం అందింది. బుధవారం రైతు అనిల్ కుమార్ రూరల్ రవి ప్రకాష్ నాయక్ 55,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా దాడి చేసి గుంటూరు జిల్లా ఎసిబి అధికారులు పట్టుకున్నారు. ఈ దాడుల్లో ఏసీబీ అడిషనల్ ఎస్పీ మహేంద్ర మత్తే, డిఎస్పి సత్యానంద్ తదితరులు పాల్గొన్నారు.
చిలకలూరిపేటలో ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారన్న వార్త దానంవంలా వ్యాపించడంతో చిలకలూరిపేట మునిసిపల్, రెవిన్యూ,సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అధికారులు అగుపడకుండా పోయారు.

