శుక్రవారం ఉదయం 11 గంటల నుండి చిలకలూరిపేట తహసిల్దారు వారి కార్యాలయంలో నామినేషన్ల స్కూటీని కార్యక్రమం నిర్వహించారు. రాత్రి 9 గంటల వరకు స్కూటీని జరిగింది. వీరిలో తెలుగుదేశం పార్టీకి చెందిన పత్తిపాటి శరత్, వైసీపీకి చెందిన కావటీ మాధవి, మద్దుమాల ప్రసన్నాంజనేయులు, తోపాటు ఇండిపెండెంట్ వివిధ పార్టీల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అయితే తెలుగుదేశం పార్టీ తరఫున డమ్మీ అభ్యర్థిగా ప్రతిపాటి శరత్, వైసీపీ తరఫున డమ్మీ అభ్యర్థిగా కావటి మాధవి నామినేషన్ వేయటంతో వీరు బీఫామ్ సమర్పించకపోగా కేవలం ఇద్దరు వ్యక్తులతో మాత్రమే ప్రపోజల్ సంతకాలు చేయించారు. బీఫామ్ వీరి పేరు మీద ఇవ్వకపోవటంతో వీరిని ఇండిపెండెంట్ లు గా కూడా కాకుండా తిరస్కరించినట్లు అధికారులు తెలిపారు. తిరస్కరించిన జాబితా ఈ క్రింది విధంగా.
చిలకలూరిపేట: నామినేషన్ స్క్రూటినీ లో
మొత్తం..33.
అమోదించినవి....26
తిరస్కరణ....7.
1) నల్లపు కోటేశ్వరరావు.BSP.
2) ప్రత్తిపాటి శరత్ tdp.
3) కావ ట్టి మాధవి ysrcp
4) మధు మల్ల ప్రసన్నాంజనేయులు. Ysrcp
5) పసుపులేటి శ్రీనివాస. జాతీయ జనసేన.
6) మంజ ముత్తయ్య. విముక్త చిరుతుల కక్ష.
7) పఠాన్ రషీద్ . ఇండిపెండెంట్.