నాదెండ్ల : నాదెండ్ల మండలంలో నలుగురు ప్రభుత్వ సిబ్బందిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
1. సంకురాత్రిపాడు విఆర్వో ఇట్టెల నాగ జ్యోతి
2. సంకురాత్రిపాడు డిజిటల్ అసిస్టెంట్ సయ్యద్ అహదుల్లా
3. నాదెండ్ల - 1 డిజిటల్ అసిస్టెంట్ తాడిబోయిన ఈశ్వర్ యాదవ్
4. నాదెండ్ల - 1 గ్రామ సర్వేయర్ వాసిమళ్ళ సుందర్ పాల్* లు ఈ జాబితాలో ఉన్నారు.
స్వర్ణ గ్రామ కార్యాలయాల్లో (గ్రామ సచివాలయం) పౌరసేవల కోసం వచ్చే ప్రజలను, రైతులను ఇబ్బందులకు గురిచేసిన కారణంగా ఈ సస్పెన్షన్లు జరిగినట్లు ప్రాథమిక సమాచారం. ఈ సస్పెన్షన్లను ఆయా DDO లు ధృవీకరించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

