బంగారం చోరీ కేసును చేధించిన పోలిసులు
ఆరుగురు దొంగలను అరెస్టు చేసి, 566 గ్రాముల బంగారం, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
పల్నాడు:- జిల్లా కారంపూడి లో గత సోమవారం వినుకొండ కు చెందిన బంగారుపు వ్యాపారి యక్కల శ్రీనివాసరావు పై నలుగురు యువకులు దాడి చేసి, అతని వద్ద ఉన్న బంగారుపు వస్తువుల బ్యాగ్ ను చోరీకి పాల్పడ్డారు.
ఈ సంఘటన ను పోలిస్ శాఖ ఛాలెంజ్ గా తీసుకుని వారం రోజుల వ్యవధిలోనే గుంటూరు కు చెందిన నలుగురు, కారంపూడి కి చెందిన ఇద్దరు యువకులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి సుమారు 566 గ్రాముల బంగారం వస్తువులను, దొంగలు ఉపయోగించిన రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు విలేకరుల సమావేశంలో ఎస్పీ కృష్ణారావు తెలిపారు.

