728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 25, 2026

న్యాయ విద్య పూర్తి...ప్రజాసేవకు తొలిఅడుగు


 పట్టా చేతిలోకి.. న్యాయం హృదయంలోకి..

లా గ్రాడ్యుయేట్లకు పట్టాలు.. సమాజానికి కొత్త న్యాయసైన్యం"...

న్యాయ విద్య పూర్తి.. ప్రజాసేవకు తొలి అడుగు"...

పట్టా కాదు.. న్యాయసేవకు నాంది...

రాజ్యాంగ విలువలను కాపాడే న్యాయవాదులుగా ఎదగాలని పిలుపు...

నరసరావుపేట: న్యాయ విద్య పూర్తి చేసి పట్టా అందుకోవడం అంతిమ లక్ష్యం కాదని, ప్రజలకు న్యాయం అందించే బాధ్యతాయుతమైన వృత్తి జీవితానికి అది తొలి అడుగని పలువురు న్యాయవేత్తలు, అధ్యాపకులు పేర్కొన్నారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట ఎంఏఎం లా కళాశాలలో 2023–26 ఎల్‌ఎల్‌బీ బ్యాచ్ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేషన్ డిగ్రీ అందుకున్న విద్యార్థి శేషగిరి గోపిమణికంఠ మాట్లాడుతూ న్యాయవాది కేవలం కేసులు వాదించే వ్యక్తి మాత్రమే కాదని, రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజల్లో నిలబెట్టే సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తి అని,న్యాయవాద వృత్తిలో నిజాయితీ, నైతిక విలువలు, సేవాభావం అత్యంత ముఖ్యమని సూచించారు."మూడేళ్ల పాటు నేర్చుకున్న న్యాయ విద్య ఈరోజు పట్టా రూపంలో మా చేతికి వచ్చింది. అయితే ఇది విద్యకు ముగింపు కాదు.. ప్రజల తరఫున న్యాయం కోసం నిలబడే బాధ్యతకు నాంది. మా అధ్యాపకులు అందించిన మార్గదర్శకత్వాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటాను. చట్టాన్ని ప్రజలకు చేరువ చేస్తూ నిజాయితీతో కూడిన న్యాయవాదిగా ఎదగడమే నా లక్ష్యం" అని అన్నారు.నేటి సమాజంలో సైబర్ నేరాలు, కుటుంబ వివాదాలు, ఆస్తి తగాదాలు, వినియోగదారుల హక్కులు, మహిళల భద్రత, పర్యావరణ పరిరక్షణ వంటి అనేక రంగాల్లో న్యాయ అవగాహన అవసరం మరింత పెరుగుతోందని,దీంతో న్యాయ విద్యకు డిమాండ్ పెరుగుతోందని పేర్కొన్నారు. సంప్రదాయ కోర్టు ప్రాక్టీస్‌తో పాటు కార్పొరేట్ లా, లీగల్ కన్సల్టెన్సీ, ఆర్బిట్రేషన్, లీగల్ టెక్నాలజీ వంటి రంగాల్లోనూ లా గ్రాడ్యుయేట్లకు విస్తృత అవకాశాలు ఉన్నాయని వివరించారు.

నిరంతర అధ్యయనం, వృత్తి నైపుణ్యం, నైతిక విలువలు, ప్రజాసేవా దృక్పథంతో ముందుకు సాగితే న్యాయవాద వృత్తిలో ఉన్నత స్థానాలను అధిరోహించవచ్చని సూచించారు. గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ల ప్రదానం అనంతరం అతిథులను అధ్యాపకులు, విద్యార్థులు ఘనంగా సత్కరించారు. కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

గ్రాడ్యుయేషన్ డే అనేది కేవలం పట్టాలు అందుకునే వేడుక మాత్రమే కాదు. విద్యార్థి నుంచి బాధ్యతాయుతమైన వృత్తి నిపుణుడిగా మారే కీలక ఘట్టమని,ముఖ్యంగా న్యాయ విద్యార్థులకు ఇది రాజ్యాంగ పరిరక్షణ, న్యాయబద్ధత, సామాజిక న్యాయం పట్ల అంకితభావాన్ని గుర్తు చేసే సందర్భమని,ఇటువంటి కార్యక్రమాలు కొత్త తరం న్యాయవాదుల్లో సేవాస్ఫూర్తిని పెంపొందించడమే కాకుండా, సమాజంలో న్యాయం, ధర్మం, రాజ్యాంగ విలువలను మరింత బలోపేతం చేయడానికి దోహదపడతాయని గోపీమణికంఠ తెలిపారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: న్యాయ విద్య పూర్తి...ప్రజాసేవకు తొలిఅడుగు Rating: 5 Reviewed By: NEWS UPDATE